Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా బాధితుల‌కు ప్రియాంకా చేయూత‌!

Webdunia
శనివారం, 22 మే 2021 (11:23 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కరోనా బాధితులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ చేయూత‌ అందించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30 వ వ‌ర్ధంతి సందర్భంగా, ప్రియాంక గాంధీ యూపీలోని కరోనా బాధితుల చికిత్స కోసం ఒక ట్రక్కులో ఔష‌ధాల‌ను పంపించారు.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సంక్షోభం స‌మ‌యంలో త‌మ నేత‌ ప్రియాంక గాంధీ సేవా భావంతో బాధితుల‌ను ఆదుకుంటున్నార‌న్నారు.
 
యూపీలో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌టంతో ప్రియాంక గాంధీ  ఛత్తీస్‌గ‌ఢ్‌ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్క‌డ‌కు పంపార‌న్నారు. త‌ద్వారా వందలాది మంది బాధితులు త‌మ ప్రాణాలు కాపాడుకోగ‌లిగార‌న్నారు.

యూపీ రాజధాని లక్నోతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రియాంకా గాంధీ పంపిన ట్ర‌క్కులో సుమారు 50 వేల కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్‌లు ఉన్నాయ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments