Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:38 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్‌ తలపెట్టిన యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్‌ చేస్తుండగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం జరిగే పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం లేదని చెప్పారు.
 
రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. యాత్ర బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
 
అయితే ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఈ యాత్ర రాష్ట్రంలో ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments