Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతలేని వ్యక్తులు ఇలానే మాట్లాడుతారు : ప్రియాంకా గాంధీ

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (13:24 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. సున్నితమైన సమస్యపై సీఎం యోగి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రుల్లో చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... కరోనా పేషెంట్ల కుటుంబీకులు పడుతున్న ఆవేదన యోగికి తెలియడం లేదని దెప్పిపొడిచారు. 
 
కరోనా బాధితుల స్థానంలో ఉండి ఆలోచన చేయాలని యోగికి సూచించారు. బాధ్యత లేని ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాయని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి యూపీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ప్రియాంక చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలను చేసినందుకు తమరు తనపై కేసులు పెట్టాలనుకుంటే... తన ఆస్తులను సీజ్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న విషమ పరిస్థితులను సీఎం అర్థం చేసుకోవాలని... ఒక మెట్టు కిందకు దిగి, పేషెంట్ల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments