Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో బిలియనీర్లకే మోడీ సర్కారు భద్రత : రెచ్చిపోయిన ప్రియాంకా

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:28 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని బిలియనీర్లకు మాత్రమే మోడీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, దళితులు, మహిళలకు ఎలాంటి భద్రత లేదని ఆరోపించారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘రైతులకు న్యాయం’ పేరిట ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ఈ దేశం కొంత మందిది మాత్రమే కాదని, మీ అందరిదని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఈ దేశం ప్రధాని, ఆయన మంత్రులది మాత్రమే కాదు. ఈ దేశం మీది. అప్రమత్తంగా లేకపోతే మీ దేశంతోపాటు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు’ అని పేర్కొన్నారు.
 
లఖింపుర్‌ ఖేరీలోని రైతుల మృతిపై స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర నేతలపై ప్రియాంక మండిపడ్డారు. లక్నోలో పర్యటించవచ్చు కానీ లఖింపుర్‌ ఖేరీలో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించలేరా? అంటూ ఈ నెల 5న లక్నోలో ప్రధాని మోడీని ప్రశ్నించారు. 
 
రైతుల హత్యలో అరెస్టయిన ఆశిష్‌ మిశ్రా తండ్రి, హోం మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని ఈసందర్భంగా డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు కావాల్సింది డబ్బు కాదని, వారికి న్యాయం కావాలని కోరారు. ముద్దాయిలకే కాదు వారి కుటుంబాలకు కూడా ప్రధాని మోడీ సర్కారు ఆశ్రయం, రక్షణ కల్పిస్తుంది ఆంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments