Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీని దేశద్రోహి అంటారా? బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (09:04 IST)
ఇటీవల పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబాన్ని 'మీర్‌ జాఫర్‌' అని అవమానించినా, వారి రక్తంతో ప్రజాస్వామ్యాన్ని పోషించే వారసత్వం తమ కుటుంబానికి ఉందని, తాము తలవంచబోమని ఆమె పేర్కొన్నారు.
 
మార్చి 24న మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ ఈ అంశంపై మౌనం వీడారు. అదానీ గ్రూప్‌పై ఆందోళనలు చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ అనర్హత వేటు వేసిందని ఆరోపించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తాము పోరాడతామని ఆమె నొక్కి చెప్పారు. 
 
అదానీ గురించి మాట్లాడినందుకే తన సోదరుడు అనర్హుడయ్యాడా అంటు ప్రశ్నించారు. "అదానీ సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. మా కుటుంబం ఈ దేశానికి అమరవీరుల ను అందించింది. మేము వెనక్కి తగ్గము, పోరాడుతాము" అని ఆమె అన్నారు. దేశం కోసం అమరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి ఎలా అంటారని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments