Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీ

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (16:51 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టోక్యో చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్రం జపాన్‌కు బయలుదేరిన మోడీకి టోక్యోలో ఘన స్వాగతం లభించింది. మోడీ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముఖేష్‌ అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ తదితరులు ఉన్నారు.
 
మోడీ జపాన్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా జపాన్‌ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళతారనే భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఈ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం, మౌలిక వసతులు అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ, పౌర అణు కార్యక్రమాల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
 
ఈ పర్యటనలో మోడీ జపాన్‌లోని స్మార్ట్‌ సిటీ క్యోటో, రాజధాని టోక్యో సందర్శించనున్నారు. టోక్యోలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు లాంఛనాలు పక్కనబెట్టి జపాన్‌ ప్రధాని సింజూ అదే అ నగరానికి చేరుకున్నారు. భారత్‌లో వంద స్మార్ట్‌ సిటీలు నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో మోడీ జపాన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments