Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు మరో ఎదురుదెబ్బ... పన్నీర్‌కు జై కొట్టిన ప్రిసీడియం ఛైర్మన్.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ప్రిసీడియం ఛైర్మన్ ఇ. మధుసూదనన్‌ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జైకొట్టారు. దీంతో శశికళ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:38 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ప్రిసీడియం ఛైర్మన్ ఇ. మధుసూదనన్‌ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జైకొట్టారు. దీంతో శశికళ షాక్‌కు గురయ్యారు. పైగా, పన్నీర్ సెల్వంవైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 
 
ఇదిలావుండగా, శశికళ వర్గం దాచివుంచిన ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకుని రావాలంటూ ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో తమిళనాడు డీజీపీ కదిలారు. ఎమ్మెల్యేలు ఏఏ స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో ఉన్నారో తెలుసుకోవాలని పోలీసులకు చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలు శశికళ వర్గానికి షాక్‌ను కలిగించేవేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కాగా, ఎమ్మెల్యేల్లో 20 మంది వరకూ మహాబలిపురంలోని ఓ స్టార్ రిసార్టులో ఉన్నారన్న సమాచారం మినహా, మిగతావాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా రహస్యంగానే ఉంది. వారందరినీ కనుగొని బయటకు తెచ్చేందుకు డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగినట్లయింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments