Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న తిరుమలకు రాష్ట్రపతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:41 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రానున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారన్నారు.

అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారని, మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు.
 
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..
ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం. 11 గంటల 40 నిమిషాలకు తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస. 12 గంటల 40 నిమిషాలకు శ్రీవారి దర్శనం. 1:50 నిమిషాలకు తిరిగి పద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి. 3.15 నిమిషాలకు తిరుమల నుంచి తిరుపతి విమానాశ్రయానికి పయనం. 4.10గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు పయనం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments