Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (16:48 IST)
దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బడిపంతులుగా మారిపోయారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో ఆయన ఉపాధ్యాయుడి అవతారమెత్తి విద్యార్థులకు భారతీయ రాజకీయ చరిత్రపై పాఠాలను బోధించారు. ఆ సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తాను చిలిపి పిల్లోడిని (నాటీ బాయ్) అంటూ చెప్పుకొచ్చారు.
 
 
గురుపూజోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గతిలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా చిలిపి వాడినని, తన చేత అమ్మ బలవంతంగా పనిచేయించేదని చెబుతూ, ఆనాటి రోజులను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. 
 
తాను చదువుకున్న రోజుల్లో కిరోసిన్‌తో వెలిగే దీపాలు మాత్రమే ఉండేవని, తాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్‌ను మాత్రమేనని ప్రణబ్ వివరించారు. నిత్యమూ పాఠశాలకు వెళ్లేందుకు 5 కి.మీ నడిచేవాడినని చెప్పుకొచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments