Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు ఎవరంటే?

విజయదశమి పర్వదినాన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:16 IST)
విజయదశమి పర్వదినాన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి  కొత్త గవర్నర్లను నియమించారు. 
 
వీరిలో దక్షిణాదిలో అత్యంత కీలకంగా ఉన్న తమిళనాడుకు భన్వరిలాల్‌ పురోహిత్‌ , మేఘాలయకు గంగాప్రసాద్‌, అరుణాలచల్‌ ప్రదేశ్‌‌కు బీడీ మిశ్రా, బిహార్‌కు సత్యపాల్‌ మాలిక్‌, అస్సోంకు జగదీష్‌ ముఖీ, అండమాన్‌ నికోబార్‌కు మాజీ అడ్మిరల్‌ దేవేంద్ర కుమార్‌ జోషిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారు. గతంలో జగదీశ్‌ ముఖీ అండమాన్‌ నికోబార్‌ దీవులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పనిచేశారు.
 
కాగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కె రోశయ్య పదవీ విరమణ తర్వాత ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇపుడు పూర్తి స్థాయి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments