Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన దళిత గర్భిణీపై అగ్రకులస్తుల దాడి...

గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:55 IST)
గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని అమిర్‌గఢ్ తాలుగా కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా (25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరిద్దరు దళిత కులానికి చెందినవారు. 
 
అయితే, ఇదే గ్రామంలో దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తుల పొలంలో గోవు చనిపోయింది. ఆ కళేబరాన్ని తొలగించేందుకు రావాలని దళిత దంపతులను అగ్రకులస్తులు కోరారు. ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని, అందువల్ల కళేబరాన్ని తొలగించలేమని బదులిచ్చారు. 
 
తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది నీలేశ్‌పై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుకోబోయింది. దీంతో ఆమెతో పాటు.. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైన కూడా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కేసులు నమోదుచేసి దాడికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం