Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు.. దేశ వ్యాప్తంగా ముస్తాబైన నగరాలు

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (13:19 IST)
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో అందంగా ముస్తాబు చేశఆరు. ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేపాల్‌లోని జనక్ పూర్ కూడా ఈ వేడుకలు జరుగనున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేల దీపాలతో రామనామం రాశారు. 
 
అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతుంది. రామ మంది ప్రవేశ ద్వారాన్ని పూలతో అందంగా అలంకరించారు. వీధుల్లో తారణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతుంది. 
 
కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలకు దేశ వ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలుచోటు ఏర్పాటు చేసిన లైట్‌ షోలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
 
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో వేలాది దీపాలతో సియావర్ రామచంద్ర కీ జై అంటూ నినాదాలు రాశారు. చాందా క్లబ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీమాతా వైష్ణో దేవి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్‌‍లో జనక్ పూర్‌లోనూ సంబరాలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments