Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏడుగురు మహిళలకు చోటు.. ఆ ఇద్దరు రాజీనామా

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:22 IST)
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్‌ కేంద్ర మంత్రులైన రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి వర్గం మెగా విస్తరణ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ పదవులను వీడారు. ట్విట్టర్‌తో వివాదం, కొత్త ఐటీ రూల్స్‌పై అన్ని రంగాల నుంచి విమర్శలు రావడంతో రవి శంకర్‌ ప్రసాద్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం.
 
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్థన్‌, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌, సదానంద గౌడ వంటి సీనియర్‌ నేతలు, కీలక మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
మరోవైపు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. పలు సామాజిక సంస్ధల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఇక యూపీలోని మిర్జాపూర్‌లో అప్నాదళ్ ఎంపీగా ఎన్నికైన అనుప్రియా సింగ్ పటేల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments