Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరుకుల కోసం పక్కూరికెళ్లిన తల్లి - కుమార్తెను కాటేసిన కన్నతండ్రి

Webdunia
గురువారం, 15 జులై 2021 (12:28 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడుగా మారిపోయాడు. ఫలితంగా కన్నతండ్రిపై అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో జరిగింది. 15 ఏళ్ల కుమార్తెపై కన్నతండ్రే పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెను చెరబట్టాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అప్పటి నుంచి పలుదఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరించేవాడు. తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. 
 
పోలీసులు వెళ్లి మందలించారు. ఆ తరువాత బాలిక.. అవ్వ, తాతల ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments