Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కుర్చీలో కూర్చొన్నావు.. ఎక్కువ కాలం సీఎంగా ఉండలేవు : పళనికి రాధాకృష్ణన్ హెచ్చరిక

దివంగత జయలలిత కూర్చొన్న కుర్చీలో కూర్చొన్నావు.. ఇకపై ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేవు అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. పళనిస్వామి కూర్చొన్న కుర్చీ అద్దె కు

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:34 IST)
దివంగత జయలలిత కూర్చొన్న కుర్చీలో కూర్చొన్నావు.. ఇకపై ఆ పదవిలో ఎక్కువ రోజులు ఉండలేవు అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. పళనిస్వామి కూర్చొన్న కుర్చీ అద్దె కుర్చి. అందులో ఎక్కువ కాలం ఉండలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి సోమవారం సచివాలయానికి వెళ్లి జయలలిత వినియోగించిన కుర్చీలో కూర్చొన్నారు. దీనిపై పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. 'స్వంత ఇంట్లో మన కుర్చీలో కూర్చోవడం, అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ' పళనిస్వామిపై ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
 
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి 'అద్దె కుర్చీ'లో ఉన్నారని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గు చేటన్నారు. విపక్షాలు లేకుండానే స్పీకర్ ధనపాల్ బలపరీక్ష నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments