Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయు కాలుష్యం.. ఏడాదికి 16లక్షల మంది మృతి.. పదిదేశాల్లో భారత్‌

వాయు కాలుష్యంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడ

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:10 IST)
వాయు కాలుష్యంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడైంది. పారిశ్రామికాభివృద్ధి వల్ల వాయు కాలుష్యం పెరిగి జనం మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని గ్రీన్ పీస్ అనే సంస్థ తెలిపింది. గ్రీన్ పీస్ సంస్థలో జరిపిన సర్వేలో.. వాహనాల పొగతో పాటు బొగ్గు కాల్చడం ద్వారా అధికంగా కాలుష్యం వెలువడుతుందని పేర్కొంది. 
 
వాయు కాలుష్య మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పది దేశాల్లో భారతదేశం ఉందని తేలింది. భారత్, చైనా దేశాలు వాయు కాలుష్యం పెరిగినా ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపింది. రెండు దేశాల్లోనూ బొగ్గు వినియోగం పెరగటం వల్ల కాలుష్యం పెరిగిందని నివేదిక తేల్చింది. రెండు దేశాల్లోనూ లక్షమందిలో వాయుకాలుష్యం 115 నుంచి 138 మందిని ప్రభావితం చేసిందని గ్రీన్ పీస్ వివరించింది. అధిక ఆదాయం వస్తున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో వాయుకాలుష్యం వల్ల మరణాల సంఖ్య నాలుగురెట్లు పెరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments