Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:04 IST)
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధన ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు లేదా రూ.వెయ్యి అపరాధం చెల్లించాలన్నది ఆ నిబంధనగా ఉంది. ఈ నిబంధనను ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఇందులో ఉండే ఒక బటన్ నొక్కితే వీవీప్యాట్‌లో మరో గుర్తుకనబడిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. 
 
అయితే, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓటరు ఏ గుర్తుపై అయితే బటన్ నొక్కుతాడో వీవీప్యాట్‌లో కూడా అదే గుర్తుపడిందని చెప్పాల్సిందే. మరో గుర్తుకు పడిందని చెబితే మాత్రం ఆరు నెలలు జైలుశిక్ష లేదా రూ.1000 వెయ్యి అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన. ఈ నిబంధనపై సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments