Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:04 IST)
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధన ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు లేదా రూ.వెయ్యి అపరాధం చెల్లించాలన్నది ఆ నిబంధనగా ఉంది. ఈ నిబంధనను ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఇందులో ఉండే ఒక బటన్ నొక్కితే వీవీప్యాట్‌లో మరో గుర్తుకనబడిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. 
 
అయితే, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓటరు ఏ గుర్తుపై అయితే బటన్ నొక్కుతాడో వీవీప్యాట్‌లో కూడా అదే గుర్తుపడిందని చెప్పాల్సిందే. మరో గుర్తుకు పడిందని చెబితే మాత్రం ఆరు నెలలు జైలుశిక్ష లేదా రూ.1000 వెయ్యి అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన. ఈ నిబంధనపై సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments