ఎంపీలకు జీతం సరిపోవడం లేదు... కంగనా రనౌత్

సెల్వి
శనివారం, 12 జులై 2025 (14:00 IST)
రాజకీయ నేతల వేతనాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనాలు సరిపోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి కనిసం 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉండటమే ఇందుకు కారణమన్నారు. పైగా, రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఎంపీలకు ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని, ఇంకొందరు ఇతర వృత్తుల్లో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments