Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలకు జీతం సరిపోవడం లేదు... కంగనా రనౌత్

సెల్వి
శనివారం, 12 జులై 2025 (14:00 IST)
రాజకీయ నేతల వేతనాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనాలు సరిపోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి కనిసం 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉండటమే ఇందుకు కారణమన్నారు. పైగా, రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఎంపీలకు ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని, ఇంకొందరు ఇతర వృత్తుల్లో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments