Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలకు జీతం సరిపోవడం లేదు... కంగనా రనౌత్

సెల్వి
శనివారం, 12 జులై 2025 (14:00 IST)
రాజకీయ నేతల వేతనాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనాలు సరిపోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి కనిసం 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉండటమే ఇందుకు కారణమన్నారు. పైగా, రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఎంపీలకు ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని, ఇంకొందరు ఇతర వృత్తుల్లో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments