Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (14:24 IST)
పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమృతసర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రాకెట్ లాంచ్ రకం ఆయుధంతో జరిగిన ఈ దాడిలో భవనం కొంత ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరలో వున్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా వుండొచ్చునని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. 
 
ఈ ఏడాది మేలో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments