Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ విద్యార్థినిపై అత్యాచారం.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (10:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పదో తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేసి, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్ పోలీసులు కాల్చాల్సి నిర్బంధ పరిస్థితి వచ్చింది. 
 
పోలీసు అధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిందితులను కోర్టుకు తీసుకుని వెళుతుండగా, వారిలో ఒకడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈఘటనలో అతనికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని మీరట్ రూరల్ ఎస్పీ కేశవ్ మిశ్రా తెలిపారు.
 
కాగా, ఈ కేసులో టెన్త్ విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఆ లేఖ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 
 
నిందితుల్లో లఖన్ (18) అనే యువకుడు పోలీసు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని కేశవ్ వెల్లడించారు. కోర్టుకు తీసుకుని వెళుతున్న క్రమంలో ఓ పోలీసు వద్ద ఉన్న ఉన్న తుపాకిని లాక్కొని, సమీపంలోని చెరుకు తోటలోకి పారిపోయాడని, దీంతో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments