Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. నిఘాను పెంచిన పోలీసులు

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (10:26 IST)
కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అఖిలపక్ష నేత‌ల‌ సమావేశం జ‌రుగ‌నుంది. ఢిల్లీలో ఈ భేటీ జరుగనుంది. దీంతో సమావేశం జరుగనున్న ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి గ‌ల‌ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై గురువాం సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజ్యాంగంలోని అధికరణ 370 ని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్‌ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. 
 
కాగా, ప్ర‌ధానితో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సహా కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా బుధవారం ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments