Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు నుంచి బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి బాంబు వెళ్లాలి : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!!

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (08:32 IST)
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి శత్రుదేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై ఏమాత్రం ఉపక్షించాల్సిన అవసరం లేదని, అటు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి బాంబు వెళ్లాలని భారత సైన్యాధిపతులకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ సైన్యం, వారి ప్రేరేపిత ఉగ్రమూకల కాల్పులకు ధీటైన సమాధానం ఇవ్వాలని ఆయన దేశ త్రివిధ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. తూటాకు తూటానే సమాధానం అనే రీతిలో మన ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. 
 
ఆ వార్తా సంస్థ కథనం మేరకు.. అక్కడ నుంచి ఒక తూటా పేలితే, ఇక్కడ నుంచి బాంబు వెళ్ళాలి. సరిహద్దు నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగగబడితే భారత బలగాలు మిస్సైళ్ళతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వారు కాల్పులు ప్రారంభిస్తే మనం రెట్టింపు స్థాయిలో కాల్పులు జరపాలి. వారు దాడి చేస్తే మనం మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయాలి అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జారీచేసిన తాజా కీలక ఆదేశాలతో భారత సాయుధ బలగాలు సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)పై భారత వైఖరి, ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు వంటి పరిణామాల పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశాన్ని ఇస్తూనే, ప్రధాని మోడీ సాయుధ బలగాల అధిపతులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments