Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ బర్త్ డే : తల్లికి పాదాభివందనం ... రూ.5001 కానుక!

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (11:17 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం సాదాసీదాగా జరుపుకున్నారు. అయితే, తన తల్లి హీరాబా ఇంటికి వెళ్లిన ఆయన.. తల్లికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడికి తల్లి రూ.5001ను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలి జన్మదినాన్ని జరుపుకుంటున్న కొడుకును ఆశీర్వదించిన హీరాబా, రూ.5001లను జన్మదిన కానుకగా అందించారు. ఈ మొత్తాన్ని మోడీ, జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయనిధికి అందజేశారు. 
 
ఇదిలావుంటే, జన్మదినం సందర్భంగా తల్లి దీవెనల కోసం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే మోడీ, ఓ సాధారణ కారులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఎవరూ తన జన్మదిన వేడుకలను జరపవద్దన్న మోడీ, తాను కూడా తల్లి దీవెనలు తీసుకుని సరిపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జపాన్ ప్రధాని షింజో అబేలు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments