Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ నిర్ణయం మానవత్వం లేని చర్య... పెను విపత్తుగా మారొచ్చు : అమర్త్య సేన్

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనీ, మానవత్వం లేని చర్యగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఆయన బుధవారం కర

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (17:30 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనీ, మానవత్వం లేని చర్యగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఆయన బుధవారం కరెన్సీ నోట్ల రద్దుపై స్పందించారు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది తెలివైనది కాదని, మానవత్వం లేని చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
కరెన్సీ నోట్లు, బ్యాంకులు, బ్యాంకు ఖాతాలతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థను మోడీ నిర్ణయం బలహీన పరిచిందని అమర్త్య సేన్ ఆరోపించారు. నమ్మకంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మూలలకు అడ్డుకట్ట వేసే చర్య అని అన్నారు. ప్రజల ఆర్థిక విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు ప్రభుత్వం నోటుపై ఇచ్చిన వాగ్ధానాన్ని వమ్ముచేయడమేనని ఆయన అన్నారు. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారవచ్చని అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తంచేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments