Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న నరేంద్ర మోడీ - చంద్రబాబు!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (09:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమతమ విదేశీ పర్యటనలను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనలకు గత వారం బయలుదేరిన విషయం తెల్సిందే. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా చైనా పర్యటనకు వెళ్లారు. 
 
మూడు దేశాల్లో తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను మోడీ ముగించగా, చైనాలో ఐదు రోజుల పర్యటనను చంద్రబాబు పూర్తి చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటించగా, చైనా కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. 
 
ద్వైపాక్షిక సంబంధాలను నరేంద్ర మోడీ బలపరిస్తే, పారిశ్రామిక సంబంధాలను బాబు పటిష్ఠం చేశారు. ఢిల్లీ, పాలంలోని టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కి ప్రత్యక విమానంలో మోదీ చేరగా, ఆయనకు ఢిల్లీ నేతలు స్వాగతం పలికారు. హైదరాబాదులో బాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments