Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్చువల్ ప్లాట్పార్మ్‌ ద్వారా శ్రీలంక ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (17:54 IST)
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్చెతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు వర్చువల్ ప్లాట్పార్మ్‌లో జరగడం విశేషం. ఈ సమావేశ ప్రారంభంలో ప్రధాని మాట్లాడుతూ ఇటీవల జరిగిన శ్రీలంక ఎన్నికలలో రాజపక్చె ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించచడంతో ఇరు దేశాల మధ్య సహాయ సహాకారాలు మరింత బలపడుతాయని చెప్పారు.
 
ఇరు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకునేందుకు మరో అవకాశం వచ్చిందని అన్నారు. ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో మనవైపు చూస్తున్నారని తెలిపారు. వర్చువల్ ప్లాట్పార్మ్ ద్వారా మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
మరోవైపు గత ఆగస్టు నెల 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్చె ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత వేరే దేశాధినేతతో ఆయన చర్చలు జరపడం ఇదే ప్రథమం. ఇరు దేశాల మధ్య అన్ని రంగాలలో ఉన్న బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధానులు చర్చలు జరిపినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments