Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారు : బీజేపీ నేతలపై మోడీ ఫైర్

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారని సొంత పార్టీ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో ఆ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (10:35 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారని సొంత పార్టీ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దును కరెన్సీపై సర్జికల్‌ దాడిగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని సూచించారు. 
 
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో శత్రు శిబిరాలను కనుగొని ధైర్య సాహసాలతో ఒక్కరు కూడా మరణించకుండా చేసిన మిలటరీ ఆపరేషన్‌తో పెద్దనోట్ల రద్దును పోల్చడం సమంజసం కాదన్నారు. ఇలాంటి ప్రచారం భారత జవాన్ల సేవలను కించపరిచినట్టే అవుతుందని, అందువల్ల ఆ తరహా ప్రచారం తక్షణం మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా త్వరలోనే నగదు  రహిత సేవలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం 2.6 లక్షల మంది రైల్వే టిక్కెట్లును కొనుగోలు చేస్తుంటే అందులో 56 శాతం ఈ-టిక్కెట్లే ఉన్నాయని, త్వరలో 100కు 100 శాతం ఈ-టిక్కెట్ల విధానం వస్తుందన్నారు. తమ బంగారు భవితకు నాంది పడిందని పేద ప్రజలు భావిస్తున్న తరుణంలో వారిని ప్రతిపక్షాలు గందరగోళంలోకి నెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments