Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను ఎరవేసి వ్యాపారం చేస్తారా... ఫార్మా కంపెనీలపై మోడీ ఫైర్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (10:52 IST)
దేశంలోని ఫార్మా కంపెనీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ఫార్మా కంపెనీలు అమ్మాయిలను ఎరవేసి వ్యాపారం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన స్కామ్ ఒకటి వెలుగుచూసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వైద్యులకు యువతులను ఎరవేస్తూ, వారిని విదేశీ విలాస యాత్రలకు పంపుతూ, ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాలను మానుకోండని ఫార్మా కంపెనీలకు హితవు పలికారు. 
 
తాజాగా దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన జైడస్‌ కాడిలా, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, వోక్‌హార్ట్‌, అపోలో సహా అనేక ప్రముఖ మందుల తయారీ, విక్రయ కంపెనీల యాజమాన్యాలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ పై వ్యాఖ్యలు చేశారు. 'సాథీ' అనే ప్రభుత్వేతర సంస్థ నివేదిక బయటికొచ్చాక ముఖ్యమైన ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 
 
'మార్కెటింగ్‌లో నీతి, విలువలు పాటించండి. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. తీవ్రమైన చట్టాలు చేస్తాం' అని ప్రధాని వారిని హెచ్చరించారు. ఈ దుస్సంప్రదాయాలకు కట్టడిచేసే చట్టాలు, నిబంధనలు రూపొందించాలని ఇప్పటికే రసాయనాలు, ఎరువులు, వైద్య ఆరోగ్య శాఖలను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments