Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (14:23 IST)
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు హెచ్చరించారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నట్టు తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 
 
ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం అయిన మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడుని కలిచివేసిందన్నారు. 'ఈ రోజు మీతో నా మనసులోని మాటను పంచుకుంటున్నన వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండివుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నాను' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments