Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కర్నాటక - మహారాష్ట్రలలో ప్రధాని మోడీ పర్యటన

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (13:23 IST)
దేశంలో త్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కర్నాటకలో పర్యటిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళతారు. 
 
కర్నాటక రాష్ట్ర పర్యటనలో యాదగిరి, కలబురిగి జిల్లాలో ఆయన పర్యటిస్తారు. కొడెకలో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శుంకుస్థాపనలు చేస్తారు. 560 గ్రామాల్లో మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా సాగునీటి ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. 
 
అలాగే, సాయంత్రం మహారాష్ట్ర పర్యటనకు వెళతారు. ఛత్రపతి మహారాజ్ టెర్మినల్ పునరాభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అలాగే, రూ.38800 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముంబై మెట్రోలో రెండు లైన్లను ఆయన ప్రారంభిస్తారు. ఈ మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments