Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్వాయ్ ఆపి బాలికను ఆశీర్వదించిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 31 మే 2022 (16:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో అరుదైన, ఆసక్తికర దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్ ఆపి ఓ బాలికను ఆశీర్వదించారు. అదే సమయంలో ఆ బాలిక వేసిన తన తల్లి పెయింటింగ్‌ను ప్రధాని మోడీ తీసుకున్నారు. 
 
ప్రధాని మోడీ మోడీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. 
 
రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డిన జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోడీ... ఓ చోట ఉన్న‌ట్టుండి త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారులో నుంచి దిగిన మోడీ.. ఆ జ‌న స‌మూహంలో బారీకేడ్ల‌కు ఆవ‌ల నిలుచున్న ఓ బాలిక వ‌ద్ద‌కు వెళ్లారు. 
 
ఆ బాలిక చేతిలోని పెయింటింగ్‌ను తీసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవ‌లే నిలుచుండి మ‌రీ మోడీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే... మోడీ ఆ బాలిక‌ను ఆశీర్వ‌దించారు. 
 
ఇంత‌కీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవ‌రిదో తెలుసా? మోడీ మాతృమూర్తిది. కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోదీ... త‌న త‌ల్లి పెయింటింగ్ చూడ‌గానే త‌న కాన్వాయ్‌ని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments