Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూకు సోనియా నివాళులు - నేడు బాలల దినోత్సవం

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (10:44 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాళులు అర్పించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
భారత మొట్టమొదటి ప్రధానిగా సేవలందించిన పండిత్​ జవహర్​లాల్​ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ మహానేతకు నివాళులర్పించారు. ఢిల్లీలోని శాంతివన్​లో నెహ్రూ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
కాగా, 1889 నవంబరు 14న ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో నెహ్రూ జన్మించారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న ఆయన కన్నుమూశారు. 
 
చిన్నారులను ఎంతో ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును 'జాతీయ బాలల దినోత్సవం'గా జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చిన్నారులతో వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments