నెహ్రూకు సోనియా నివాళులు - నేడు బాలల దినోత్సవం

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (10:44 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాళులు అర్పించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
భారత మొట్టమొదటి ప్రధానిగా సేవలందించిన పండిత్​ జవహర్​లాల్​ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ మహానేతకు నివాళులర్పించారు. ఢిల్లీలోని శాంతివన్​లో నెహ్రూ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.
 
కాగా, 1889 నవంబరు 14న ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో నెహ్రూ జన్మించారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న ఆయన కన్నుమూశారు. 
 
చిన్నారులను ఎంతో ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును 'జాతీయ బాలల దినోత్సవం'గా జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చిన్నారులతో వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments