మంత్రులూ... అశోక్‌ను చూసి నేర్చుకోండయ్యా? మోడీ ప్రశంస

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాన

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక గజపతి రాజుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మంచి ప్రశంస లభించింది. పైగా, మంత్రి అశోక్‌ను చూసి ప్రతి మంత్రీ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇంతకీ ప్రధాని ఈతరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటేనే విషయాన్ని పరిశీలిస్తే.. 
 
రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు... కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఒక సాధారణ పౌరుడిలాగే ఉంటారు. ఎక్కడ కూడా రాజుననే గర్వం ఆయనలో మచ్చుకైనా కనిపించదు. అలాగే, వీఐపీ కల్చర్‌కు ఆమడదూరంలో ఉంటారు. ఈ లక్షణమే మోడీని ఎంతగానో ఆకర్షించింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. అశోక్ గజపతి రాజు కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ సాధారణ ప్రయాణికుని వలే ప్రయాణిస్తారు. కేంద్రమంత్రిగా ఆయన నేరుగా వెళ్లి విమానం ఎక్కే అవకాశం ఉంది. కానీ అశోక్ గజపతి రాజు అలా చేయరు. తనిఖీలు నిర్వహించే వారు వెళ్ళండి సర్ అని చెప్పినా ఆయన వెళ్లరు. 
 
తనిఖీ చేయడం మీ డ్యూటీ. చేయండి తప్పు లేదు అని అంటారు. మినానాశ్రయానికి చేరుకోవడానికి ఆయన మెట్రో రైలులో ప్రయాణిస్తారట. ఇలా నిడారంబరంగా మెలుగుతుండటంతో అశోక్ గజపతి రాజుపై మోడీ దృష్టి పడింది. మంత్రులంతా అశోక్ గజపతి రాజుని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని సూచించారంటే నిజంగా విశేషమే మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments