Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (08:43 IST)
బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, కంగనా రనౌత్ సహా అనేక సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 
 
అనంతరం గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అదేవిధంగా ఒకే సారి వాడే ప్లాస్టిక్‌(సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌) నిషేధంపై మద్దతు తెలిపినందుకు నటుడు అమీర్‌ఖాన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 
 
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రధాని మోడీ చేస్తున్న కృషిని అమీర్‌ఖాన్‌ అభినందించారు. ఇందుకోసం సృజనాత్మక వ్యక్తులుగా తాము కూడా చేయాల్సిన దాని కన్నా ఎక్కువగానే కృషి చేస్తామని అమీర్‌ అన్నారు. 
 
గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు మళ్లీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే వేదికపై చేర్చినందుకు ప్రధానికి షారూఖ్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments