Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (08:43 IST)
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఇతర సభ్య దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారు. అలాగే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
కజాన్ నగరంలో జరిగే ఈ 16వ బ్రిక్స్ సదస్సు ఈ దఫా అత్యంత కీలకంగా మారింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గత యేడాదిన్నర కాలంగా సాగుతున్న యుద్ధంతో ఇజ్రాయేల్ - పాలస్తీనా  - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం.. మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగబోతుంది. దీంతో ఈ దఫా బ్రిక్స్ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. 
 
కాగా, బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి రష్యా అధినేత పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపిన విషయం తెల్సిందే. కాగా ఈ యేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ 'ను అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments