Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడ

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (06:41 IST)
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని గుర్తించారని, కొన్ని సవరణలను చేయాలని ఆయన సూచించారని చెప్పారు. 
 
ఫలితంగానే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కారణంగా 178 వస్తువులపై వసూలు చేస్తూ వచ్చిన 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో వర్తకులు, వ్యాపారులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 
 
కాగా, ఇటీవల గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ తగ్గింపు క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments