Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త శక్తిగా అవతరించాం - ఏ దేశానికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) మిషన్ శక్తి పేరుతో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏ-శాట్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిషన్‌ శక్తి'తో భారత్‌ కొత్త చరిత్ర లిఖించిందన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) ప్రయోగంతో అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. ఆ క్షిపణి కేవలం మూడు నిమిషాల్లో దిగువ కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసిందని వెల్లడించారు. ఈ విజయంతో అంతరిక్ష సామర్థ్యంలో అమెరికా, రష్యా, భారత్‌, చైనా సరసన నిలిచామని వెల్లడించారు.
 
'భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనను మనం రక్షించుకోగలం. ఇది మనమంతా గర్వించాల్సిన క్షణం' అన్నారు. ఏ-శాట్‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ఆత్మరక్షణకు మాత్రమేనని తెలిపారు. ఏశాట్‌ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించదని స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదని మరోమారు నిరూపించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments