Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త శక్తిగా అవతరించాం - ఏ దేశానికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) మిషన్ శక్తి పేరుతో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏ-శాట్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిషన్‌ శక్తి'తో భారత్‌ కొత్త చరిత్ర లిఖించిందన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) ప్రయోగంతో అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. ఆ క్షిపణి కేవలం మూడు నిమిషాల్లో దిగువ కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసిందని వెల్లడించారు. ఈ విజయంతో అంతరిక్ష సామర్థ్యంలో అమెరికా, రష్యా, భారత్‌, చైనా సరసన నిలిచామని వెల్లడించారు.
 
'భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనను మనం రక్షించుకోగలం. ఇది మనమంతా గర్వించాల్సిన క్షణం' అన్నారు. ఏ-శాట్‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ఆత్మరక్షణకు మాత్రమేనని తెలిపారు. ఏశాట్‌ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించదని స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదని మరోమారు నిరూపించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments