Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వాయిదా వేస్కోండి ప్లీజ్‌.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి

Webdunia
గురువారం, 6 మే 2021 (21:51 IST)
పాట్నా: కరోనా వ్యాప్తి చెందుతున్నా సోయి లేకుండా ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలు, విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ప్రజల తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కొన్నాళ్లు పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్లు, సామూహిక కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కరోరారు.
 
నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన పది రోజుల లాక్‌డౌన్‌తో కరోనా చెయిన్‌ తెగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనాను తరిమివేసేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిహార్‌లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.

వివాహాలకు 50 మంది అతిథులు హాజరు కావాలి. అంత్యక్రియల్లో 20 మందే పాల్గొనాలి. కిరాణా దుకాణాలు రోజు ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య తెరచి ఉంటున్నాయి. ఆ రాష్ట్రంలో రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments