Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు రెండు కాళ్లు పనిచేయలేదా? మెర్సీ కిల్లింగ్ కోరుకున్నారా? శశీ నన్ను చంపేయ్ అన్నారా?

అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ ప

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (13:00 IST)
అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ పత్రిక ఊటంకించింది. డయాబెటిస్ కారణంగా జయలలిత కాళ్లు రెండూ పనిచేయలేకుండా పోయాయని, దీంతో మనస్తాపానికి గురైన జయలలిత.. కాళ్లు లేకుండా జీవించలేనని.. తనను చంపేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు ఆ పత్రిక తెలిపింది. 
 
గత సెప్టెంబర్ 22వ తేదీ తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలోలో చేరి.. డిసెంబర్ 6న అర్థరాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంలో సస్పెన్స్ ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం పట్ల పలు అనుమానాలున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకా అమ్మ మరణంపై మిస్టరీ వీడాలని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే జయలలిత కాళ్లు పనిచేయలేకుండా పోయాయని.. అందుకే శశికళతో తనను చంపేయాలని జయలలిత కోరుకున్నట్లు మలేషియా పత్రిక తెలిపింది. 17-12-16న ప్రచురితమైన పత్రికలో అమ్మ కాళ్లు లేక జీవించలేనని, మెర్సీ కిల్లింగ్‌ చేయమని శశికళను వేడుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments