Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్‌ను చెరోసగం పంచుకుంటున్న 2 రాష్ట్రాలు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (14:01 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగిన సంస్థ భారతీయ రైల్వే. ఈ సంస్థలో వింతలూ విశేషాలకు ఏమాత్రం కొదవలేదని చెప్పొచ్చు. కానీ అవి పెద్దగా బయటకు రావు. కానీ, సాక్షాత్ రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఓ వింతైన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అదేంటంటే.. ఓ రైల్వే స్టేషన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. 
 
అలాంటి రైల్వే స్టేషన్ గుజరాత్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఈ విషయాన్ని మంత్రి పియూష్ గోయల్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్‌లో మరో సగం మహారాష్ట్ర భూభాగంలో వస్తుంది. దీంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 
'దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఓ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. 
 
కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది' అని మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఇలాంటి స్టేషన్ ఇదొక్కటే కాదు.. 'భవానీ మండి' రైల్వే స్టేషన్ కూడా ఉది. ఈ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments