Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను క్షమించండి అంటూ స్టేటస్.. IIT మద్రాస్‌లో PHD విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (14:09 IST)
ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సచిన్‌ కుమార్‌ జైన్‌(32) యధావిధిగా గిండీ క్యాంపస్‌లో తరగతులకు హాజరయ్యాడు. స్థానికంగా అద్దెకు వుంటూ.. ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. శుక్రవారం ఎవరికీ చెప్పకుండా అతడు తన గదికి వచ్చేశాడు. 
 
గంటసేపైనా జైన్‌ క్లాసుకు తిరిగిరాకపోవడాన్ని గమనించిన స్నేహితులు అతడి గదికి వెళ్లి చూశారు. అక్కడ సచిన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అత్యవసర సహాయక బృందం అతడు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఆత్మహత్యకు ముందు సచిన్‌ కుమార్‌ జైన్‌, వాట్సాప్‌లో 'నన్ను క్షమించండి, ఇది సరిపోదు' అని స్టేటస్‌ పెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపనున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments