Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్... వయనాడ్‌లో కూడా...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (09:15 IST)
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 43 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. అలాగే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభతో పాటు.. పది రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 
 
అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్‌లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
 
జార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను మోహరించింది. కాగా జార్కండ్‌లో రెండో దశ ఎన్నికలు నవంబరు 20వ తేదీన జరగనున్నాయి. నవంబరు 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అత్యధికంగా 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి మొత్తం 47 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments