Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాకీ తీర్చమన్నందుకు తుపాకీతో కాల్చి చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (06:48 IST)
చిన్నపాటి విషయాలకే కొందరు క్షణికావేశానికి లోనవుతున్నారు. బాకీ డబ్బు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకెళితే భటోలీ గ్రామానికి చెందిన ఉమేశ్‌శర్మ పఠాన్‌కోట్‌-జలంధర్‌ జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో సేల్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రుపీందర్‌ అనే వ్యక్తి తరచూ బంక్‌కు వస్తూ పెట్రోల్‌ పోయించుకుని డబ్బు చెల్లించకుండా వెళ్లేవాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా రుపీందర్‌ పెట్రోల్‌ కోసం వచ్చినప్పుడు పాత బాకీ తీరిస్తేగానీ ఇంధనం పోయనని మొండికేశాడు. దీంతో రుపీందర్‌ ఉమేశ్‌ని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అవడంతో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments