ఈ శునకం.. 30మందిని కాపాడింది.. కానీ దాని ప్రాణం మాత్రం?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:08 IST)
విశ్వాసానికి మారుపేరు శునకం. అన్నం పెట్టిన యజమానిని అదెప్పుడూ మరిచిపోదు. యజమానిని కాపాడుకోవడానికి ఇంటి ముందు కాచుకు కూర్చుంటుంది. అలా ఇంట పెంచిన ఓ పెంపుడు కుక్క 30 మంది ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన యూపీలోని బాందా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడాన్ని గమనించిన శునకం గట్టిగా మొరగడం మొదలెట్టింది. 
 
దాన్ని అరుపులు విన్న జనం.. ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చేశారు. భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం చూసిన జనాలు తమ ప్రాణాలను చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. కానీ ఇంతగా 30 మంది ప్రాణాలు కాపాడిన శునకం మాత్రం చివరికి మృతి చెందింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు జనం పరుగులు తీశారే కానీ.. ఆ శునకాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
మంటల ధాటికి సిలిండర్ కాస్త పేలడంతో ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శునకం గట్టిగా అరుస్తూ అందరినీ కాపాడింది కానీ.. సిలిండర్ పేలడంతో ఆ శునకం మాత్రం నిప్పుకు ఆహుతి అయ్యిందని చెప్పారు. ఇకపోతే.. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది.. గంటల పాటు పోరాడి మంటలను ఆర్పినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments