Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాసింజర్ రైలును 5 కిమీ వరకు తోసిన ప్రయాణికులు.. ఎక్కడ... ఎపుడు!

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (17:43 IST)
సాధారణంగా నడి రోడ్డుపై బస్సులు, లారీలు, కార్లు, చిన్నపాటి రవాణా వాహనాలు ఆగిపోవడం చూస్తుంటాం. అలాగే, ద్విచక్రవాహనాలు కూడా రోడ్లపై మొరాయిస్తుంటాయి. కానీ, బుల్లెట్ రైళ్ళ గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత రోజుల్లో... ఓ రైలు పట్టాలపై ఆగిపోయినట్టుగా కానీ, అలాంటి సందర్భం కానీ వినడం లేదా చూడటం జరిగివుండదు.
 
 
కానీ, మన దేశ చరిత్రలోనే ఈ తరహా సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. అదీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురలో. మధుర - బృందావన్‌ల మధ్య నడిచే రాధారాణి ప్యాసింజర్ రైలుకు ఈ పరిస్థితి ఎదురైంది. 
 
ఈ రైలింజన్‌లో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా మధుర ప్రాంతంలో రైలు ఆగిపోయింది. డ్రైవర్ పలుమార్లు ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు దిగి రైలును నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. స్టార్ట్ కాకపోవడంతో రైలును ఏకంగా ఐదు కిలోమీటర్ల మేరకు ప్రయాణికులు నెట్టుకుంటూ వెళ్లారు. ఇది చూసిన అందరూ అవాక్కయ్యారు. ఈ తరహా సంఘటన జరగడం దేశంలో ఇదేతొలిసారి.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments