Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో పార్లమెంట్ సమావేశాలు!

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (17:18 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏవిధంగా నిర్వహించాలనేది అతిపెద్ద సవాలుగా మారింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి ప్రభుత్వ సెంట్రల్‌ హాల్‌లో లోక్‌సభ కార్యకలాపాలను, అలాగే లోక్‌సభ హాలులో ఎగువ సభ కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్నారు.

మరోవైపు వర్చువల్ సెషన్‌ నిర్వహించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆగస్ట్‌ రెండో వారంలో కాని, మూడో వారంలో కాని వర్షాకాల సమావేశాలు జరగవచ్చని పార్లమెంట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ (సిసిపిఎ) సమావేశం అనంతరం ఉభయసభల పనితీరుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఇదిలా వుండగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్‌లో జరగవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం స్పష్టం చేశారు. 
 
కాంగ్రెస్‌ ఎంపిలతో సోనియా చర్చ
రానున్న ప్లారమెంట్‌ సెషన్‌లో లెవనెత్తబోయే ప్రధాన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా తమ పార్టీ లోక్‌సభ ఎంపిలతో చర్చించారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనాను కట్టడి చేయడంతో వైఫల్యాన్ని, ఇతర అంశాలతో పాటు సరిహద్దు వివాదంపై బిజెపి ప్రభుత్వంపై ప్రశ్నాస్తాలు సంధించేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది.

పేదలను ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలన్న డిమాండ్‌ను మోడీ సర్కార్‌ నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతుండటంపై కూడా బిజెపి ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ సెషన్‌లో కాంగ్రెస్‌ లెవనెత్తే అవకాశాలున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments