Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత... బిల్లుకు ఆమోదం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:21 IST)
కరోనా వైరస్ మహమ్మారి కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, పొదుపు మంత్రాన్ని జపించాలని నిర్ణయించింది. ఇప్పటికే కరోనా సాకుపెట్టి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
 
అలాగే, అనేక రకాలైన పొదుపు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఎంపీ వేతనాల్లో కోతకు లోక్‌సభ ఆమోదం తెలింది. మహమ్మారిపై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 
 
ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. అలాగే, ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం