Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కామ్‌లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోం : కాంగ్రెస్‌కు మోడీ వార్నింగ్

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదలు తెలిపే తీర్మానంపై న

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:17 IST)
వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలను లక్ష్యంగా చేసుకుని సాగింది.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బ్యాంకులకు రూ.వేల కోట్ల ఎగవేతలు కాంగ్రెస్‌ పాపమేనన్నారు. అలాంటి దుష్ట విధానాలను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క పన్ను ఎగవేత జరిగిందా? అని ప్రశ్నించారు.
 
అంతేగాక అవినీతిపరులను జైలుకు పంపే విషయంలో రాజీలేదన్నారు. పన్ను ఎగవేతదారులకు మేం రుణాలు ఇవ్వలేదన్నారు. అలాగే.. మేం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నామని, విద్యుత్‌ ఉత్పత్తి, పొదుపుపై దృష్టిపెట్టామని, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలైన విద్యా, సొంతింటి కల నెరవేరుస్తున్నామని మోడీ గుర్తు చేశారు.
 
ఇకపోతే, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ‌... దళిత ముఖ్యమంత్రిని అవమానించారన్నారు. అలాగే, నీలం సంజీవరెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా సర్దార్ వల్లాభాయ్ పటేల్ అయివుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదన్నారు. అంతేకాకుండా, సరికొత్త విమానయాన పథకాలతో దేశానికి రెక్కలు తొడిగామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన విమానయాన విధానం తెచ్చామని నరేంద్ర మోడీ కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments