Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఘన నివాళి.. రేపు రామేశ్వరంలో అంత్యక్రియలు

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (12:33 IST)
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. 
 
భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన హృదయంతో మహోన్నత వ్యక్తి కలాంకు వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. రామేశ్వరంలో రేపు జరుగనున్న అంత్యక్రియలకు పార్లమెంటు సభ్యులంతా హాజరుకావాలని కోరారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 'ఓం శాంతి శాంతి:' అంటూ తన ప్రసంగాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ముగించారు. అనంతరం సభను ఎల్లుండి ఉదయానికి వాయిదా వేశారు.
 
మరోవైపు... అబ్దుల్ కలాం స్వగ్రామమైన రామేశ్వరంలో రేపు అంత్యక్రియలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. కలాంకు నివాళిగా ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది. భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయిందని కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments